BSR NESW

చిన్నశేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామి చిద్విలాసం
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం చిన్నశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య హంస వాహన సేవ జరగనుంది. మరోవైపు శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.