ముండ్లమూరు తహశీల్దారుగా ఎండి నయీమ్ అహ్మద్

ముండ్లమూరు తహసీల్దారుగా ఎండి నయీమ్ అహ్మద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ తహసీల్దారుగా పనిచేసిన ఎస్ ఉషారాణి జరుగుమల్లీ మండలానికి బదిలీ కావడంతో జరుగుమల్లిలో తహశీల్దారుగా పనిచేస్తున్న నయీమ్ అహ్మద్ ముండ్లమూరు మండలానికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో డిప్యూటీ తాహశిల్దార్ గా అనుభవం ఉందని, మండలంలోని ప్రజలు, అధికారులు, విలేకర మిత్రులు, రాజకీయ నాయకులు సహకరించాలని రెవెన్యూ సంబంధమైన ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారులు ఆయనను సన్మానించారు

ముండ్లమూరు తహశీల్దారుగా ఎండి నయీమ్ అహ్మద్