తాళ్లూరు :ఉపాధి పనులు గుర్తింపు
మండలంలోని నాగంబుట్లపాలెంలో శనివారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనుల గుర్తింపు కోసం గ్రామ సభను నిర్వహించారు.పనుల గురించి ఎంపీడీవో కెవై.కీర్తి అవగాహన కల్పించారు. గ్రామంలో 37 పనులను గుర్తించారు.ఉన్నత అధికారుల అనుమతి తరువాత పనులు చేయిస్తామని చెప్పపారు. ఏపీవో మురళి, సర్పంచ్ చిమట సుబ్బారావు,కార్యదర్శి నరేంద్ర, వీఆర్వో చంద్ర పాల్గొన్నారు.
