16న చేయూత.. అకౌంట్లలోకి రూ.18,750 BSR NEWS

16న చేయూత.. అకౌంట్లలోకి రూ.18,750
AP: సీఎం జగన్ ఈ నెల 16న చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా SC, ST, OBC, మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున జమ చేస్తారు. నాలుగో విడతలో దాదాపు 26 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.