వరసిద్ధుడి సేవలో మురళీ మోహన్ శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని పూతలపట్టు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ కలికిరి మురళీ మోహన్ దర్శించుకున్నారు.. BSR NEWS

వరసిద్ధుడి సేవలో మురళీ మోహన్
శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని పూతలపట్టు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ కలికిరి మురళీ మోహన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ విగ్నేష్ పాల్గొన్నారు.