తొలి భర్త ఆత్మహత్య... రెండో పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్ పావని రెడ్డి

తొలి భర్త ఆత్మహత్య... రెండో పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్ పావని రెడ్డి

BSR NEWS

  • టాలీవుడ్, కోలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన పావని రెడ్డి
  • 2013లో సీరియల్ నటుడు ప్రదీప్ ను పెళ్లాడిన పావని
  • కొరియోగ్రాఫర్ ఆమిర్ ను రెండో పెళ్లి చేసుకుంటున్న పావని

సీరియల్స్ లో నటించి హీరోయిన్ గా మారిన వారిలో పావని రెడ్డి ఒకరు. పలు తెలుగు సీరియల్స్ లో నటించిన పావని రెడ్డి... ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా నటించింది. చారి 111, మళ్లీ మొదలైంది, గౌరవం, డ్రీమ్, డబుల్ ట్రబుల్ వంటి పలు సినిమాల్లో మెరిసింది. 

తాజాగా పావని రెడ్డి రెండో వివాహానికి సిద్ధమయింది. కొరియోగ్రాఫర్ ఆమిర్ తో ఆమె వివాహం ఈనెల 20న జరగనుంది. ఈమేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. 

2013లో పావని తొలి వివాహం జరిగింది. తెలుగు నటుడు ప్రదీప్ కుమార్ ను పావని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017లో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. పావని మరొకరితో చనువుగా ఉండటం వల్లే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే దీని గురించి పావని ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోంది.

తమిళ బిగ్ బాస్ సీజన్-5లో పాల్గొన్న పావని సెకండ్ రన్నరప్ గా నిలిచింది. ఈ రియాల్టీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ఆమిర్ తో ఆమె ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసే ఉంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు పెళ్లితో వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.