ముండ్లమూరు మండలంలోని పోలవరం క్రాస్ రోడ్డు వద్ద ముందు వెళ్తున్న ఆటోని బోలెరా వాహనం ఢీకొన్న సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 ఆంబులెన్సులో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.