HMPV: బెంగళూరులో చైనా వైరస్.. 8 నెలల పాపకు హెచ్ఎంపీవీ నిర్ధారణ

- చైనాలో వేలాదిగా బయటపడుతున్న వైరస్ కేసులు
- జపాన్ కూ వ్యాపించిన హెచ్ఎంపీవీ.. భారత్ లో ఇదే ఫస్ట్ కేస్
- పదకొండేళ్లలోపు చిన్నారులకు వ్యాపిస్తున్న వైరస్
చైనాలో బయటపడ్డ కొత్త వైరస్ హెచ్ఎంపీవీ భారత్ లోకి ప్రవేశించింది. బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల పాపకు ఈ వైరస్ సోకినట్లు పరీక్షల్లో బయటపడింది. ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం నిర్ధారించింది. ఓ ప్రైవేట్ ల్యాబ్ లో నిర్వహించిన వైద్య పరీక్షలో పాపకు వైరస్ సోకినట్లు తేలిందని ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు చైనా, జపాన్ లకే పరిమితమైన ఈ కొత్త వైరస్ బెంగళూరు చిన్నారికి సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పాపకు వైరస్ ఎలా సోకిందనే వివరాలు ఇంకా తెలియరాలేదని, వైరస్ స్ట్రైయిన్ వైద్య నిపుణులకు అంతుబట్టడంలేదని కర్ణాటక వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ వైరస్ సోకిన వారిలో ఫ్లూ తరహాలో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రధానంగా పదకొండు సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులలోనే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు చైనా వైద్య నిపుణులు చెబుతున్నారు. చైనాలో ఇటీవల ఈ వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. పలుచోట్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అక్కడి ప్రభుత్వం ఆంక్షలు కూడా విధించింది. హెచ్ఎంపీవీ వైరస్ జపాన్ కూ వ్యాపించింది.