చిత్తూరు జిల్లా ఎస్పి శ్రీ Y.రిశాంత్ రెడ్డి, IPS గారికి జిల్లా పోలీసు అధికారులచే ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పెరేడ్. BSR NEWS

చిత్తూరు జిల్లా ఎస్పి శ్రీ Y.రిశాంత్ రెడ్డి, IPS గారికి జిల్లా పోలీసు అధికారులచే ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పెరేడ్.
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సాదారణ బదిలీలలో బాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వై.రిశాంత్ రెడ్డి,IPS గారు బదిలీ అయిన సందర్భంగా జిల్లా ఆర్మ్డ్ రిజర్వు పెరేడ్ గ్రౌండ్ నందు జిల్లా ఎస్పీ గారికి పెరేడ్ వీడ్కోలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బదిలీపై వెళుతున్న ఎస్పీ గారిని ఆర్మ్డ్ రిజర్వు పోలీసు అధికారులు పెరేడ్ వీడ్కోలు నిర్వహించి ఆయనను పూలమాలలు మరియు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పోలీసు కవాతు వాహనం లో పోలీస్ ఆఫీస్ నుండి గాంధీ కూడలి పై పూలు చల్లుతూ కవాతు వాహనాన్ని జిల్లా అధికారులు అందరు లాగుతూ ఎస్పీ గారినిఘనంగాఊరేగించారు.ఈసందర్భంగా ఏ.ఆర్ అడిషనల్ ఎస్.పి శ్రీ జి.నాగేశ్వర రావు గారు మాట్లాడుతూ ఎస్.పి గారు మంచి నాయకత్వ లక్షణాలతో, వ్యక్తిత్వం గల అధికారి అని ఆయన కింద పనిచేయడం ఎంతో సంతోషకరమని అడిషనల్ ఎస్పీ గారు తెలిపారు.ఈ సందర్బముగా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా శాంతిభద్రతల పరిరక్షణలో మరియు పరిపాలనలో సహాయసహకారాలు అందించిన జిల్లా అధికారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్.ఇ.బి శ్రీమతి శ్రీలక్ష్మి, ఎఆర్ అడిషనల్ ఎస్పీ జి. నాగేశ్వర రావు, డిఎస్పీలు శ్రీ శ్రీనివాస మూర్తి, శ్రీ శ్రీనివాస రెడ్డి, శ్రీ బాబు ప్రసాద్, శ్రీ విష్ణు రఘువీర్, శ్రీ శ్రావణ్ కుమార్, ఎఆర్ డిఎస్పీ శ్రీ మురళిధర్, శ్రీ ఇలియాస్ బాష, ట్రైనీ డిఎస్పీ పావన కుమార్, జిల్లా ఇన్స్పెక్టర్ లు, ఆర్.ఐ. లు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.