టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మీ కృషితో వరద బాధితులకు భారీ విరాళం

టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మీ కృషితో వరద బాధితులకు భారీ విరాళం

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు

దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి సారధ్యంలో దర్శి నియోజకవర్గం నుండి వరద బాధితులకు సేకరించిన విరాళాలను మన ప్రియతమ ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేశారు. దర్శి టౌన్ మరియు 5 మండలాలలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర వ్యాపార వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా వరద బాధితులకు ఆదుకునేందుకు ముందుకు వచ్చి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారికి అందజేసిన విరాళాల మొత్తం 37 లక్షల 16, 200 రూపాయలను, అదేవిధంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు సొంతంగా ఇచ్చిన 10 లక్షలతో కలిపి మొత్తం 47 లక్షల 16200 చెక్కును ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మండల, టౌన్ పార్టీ నాయకులతో కలిసి అందజేయడం జరిగింది. బుధవారం రాత్రి సచివాలయంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చంద్రబాబును కలుసుకొని దర్శి ప్రజలు తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు వ్యాపార వర్గాలు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన విరాళాలను అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ల కృషిని అభినందించారు. నాయకులందరినీ కలుపుకొని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో మీరు చేసిన ఈ ప్రయత్నం అభినందనీయమన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా మన తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ లక్ష్మీ గారి నాయకత్వంలో మీరంతా కలిసి వచ్చి ఈ భారీ విరాళాన్ని అందజేయడం అభినందనీయమన్నారు. దర్శి నియోజకవర్గ నేతల స్ఫూర్తి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారితో పాటు మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, తాళ్లూరు మండల అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, కురిచేడు మండల అధ్యక్షుడు నెమలయ్య, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు, ముండ్లమూరు మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, దొనకొండ మండల అధ్యక్షుడు, నాగులపాటి శివ కోటేశ్వరరావు

ఐ టీడీపీ మండల కన్వీనర్ అంజి, తెలుగుదేశం పార్టీ నాయకులు కలవకొలను చంద్రశేఖర్, జూపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.