పూతలపట్టు: వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ BSR NEWS

పూతలపట్టు: వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ
మండలంలోని పేటమిట్టలో శ్రీకోదండరామ స్వామి ఆలయంలో విగ్రహప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గల్లా రామచంద్ర నాయుడు, అరుణ కుమారి, జయదేవ్ చేతుల మీదుగా స్వస్తి గోపూజ, యంత్రార్చన, గణపతి అష్టద్రవ్య హవనం, పంచగవ్య పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, TDP పూతలపట్టు ఇన్ఛార్జ్ మోహన్ మురళీ, సర్పంచి రాధాకృష్ణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.