దొంగతనానికి పాల్పడిన నలుగురి అరెస్ట్ BSR NEWS

      దొంగతనానికి పాల్పడిన నలుగురి అరెస్ట్

గ్రామంలో హైవేకి ఆనుకుని ఉన్న రెండు పక్క పక్క ఇళ్లలో మే 5వ తేదీ సోమవారం రాత్రి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. వారిని మే 18 వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటలకు రంగంపేట రాష్ట్ర వద్ద పూతలపట్టు సీఐ, సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఒక యాక్టివా కారు, నెంబర్ లేని బజాజ్ పల్సర్ బైక్లో నలుగురు వ్యక్తులు రాగా వారిని ఆపి విచారించగా వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో వారిని పూర్తిగా విచారించగా నలుగురు కే. యువరాజు, ఏ. మురుగన్, పి.రాజా, ఈ. శ్రీకాంత్ ఈ దొంగతనానికి పాల్పడ్డారని, వారిని అరెస్ట్ చేశామని సిఐ కృష్ణమోహన్ చెప్పారు. యాక్టివా కారు, పల్సర్ బైకు, బంగారు ఆభరణాలు మొత్తం బరువు సుమారు 216 గ్రాములు, వెండి 650 గ్రాములు స్వాధీనం చేసుకున్నామని సిఐ కృష్ణమోహన్ తెలిపారు. ఈ కేసు చేదించిన పోలీసులను చిత్తూరు డిఎస్పి ప్రశంసించారు.