పూతలపట్టు, ఐరాల మండలాల టిడిపి అధ్యక్షులుగా దొరబాబు చౌదరి, హరిబాబు నాయుడు ఏకగ్రీవం.." BSR NEWS

"పూతలపట్టు, ఐరాల మండలాల టిడిపి అధ్యక్షులుగా దొరబాబు చౌదరి, హరిబాబు నాయుడు ఏకగ్రీవం.."
చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ (టిడిపి) కార్యాలయంలో పూతలపట్టు, ఐరాల మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఎన్నిక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి "పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ గారు" అధ్యక్షత వహించారు. పూతలపట్టు నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగిన ఎన్నికల్లో, పూతలపట్టు మండల అధ్యక్షుడిగా మూడోవ సారి దొరబాబు చౌదరి గారు మరియు ఐరాల మండల అధ్యక్షుడిగా గంగారపు హరిబాబు నాయుడు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు దొరబాబు చౌదరి, గంగారపు హరిబాబు నాయుడులను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నాయకుల త్యాగస్వరూపం, పార్టీ పట్ల వారి నిబద్ధతను కొనియాడారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మండల స్థాయిలో నూతన నాయకత్వం కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజల సమస్యలపై గళమెత్తి, పార్టీ పట్ల ఉన్న విశ్వాసాన్ని మరింతగా బలపరచాలి” అని అన్నారు. గత ఎన్నికల సమయంలో పార్టీ తరఫున వీరు చేసిన కృషి మరచిపోలేనిది. ఇంటింటికి తిరిగి పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయడం, కార్యకర్తలకు మద్దతుగా నిలిచిన తీరును ఆయన గుర్తు చేశారు. ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం పార్టీ కోసం అహర్నిశలూ పని చేసిన వీరు పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన కోరుకున్నారు. “రాబోయే రోజుల్లో పార్టీని మండల స్థాయిలో మరింత బలోపేతం చేయాలని, పూతలపట్టు నియోజకవర్గాన్ని తెలుగుదేశం కంచుకోటగా తీర్చిదిద్దాలన్నదే మన ఆశయంగా, కార్యకర్తలంతా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. నాయకత్వ మార్పులతో కొత్త ఉత్సాహం నింపుకుని పార్టీకి ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింతగా పెంచేలా పని చేయాలి” అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం ముఖ్య నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.