*శ్రీకాళహస్తి వైసీపీ నుండి జనసేన లో చేరికలు* BSR NEWS

*శ్రీకాళహస్తి వైసీపీ నుండి జనసేన లో చేరికలు*
*జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఉన్నత విద్యావంతులు RCR కాలేజి ప్రిన్సిపాల్ శ్రీకాళహస్తి కి చెందిన శ్రీ. Dr. N.G.A.ప్రసాద్ గారు వారి మద్దతు దార్లతో కలిసి ఈరోజు జనసేన పార్టీలో చేరారు. శ్రీ. ప్రసాద్ గారికి నియోజకవర్గ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు*. గత ఎన్నికల్లో ప్రసాద్ గారు వైసీపీ పార్టీ గెలుపుకోసం చాలా క్రియాశీలకంగా పని చేసి, వారి కాలేజిలో చదువుకున్న వేల మంది స్టూడెంట్స్ సైతం శ్రీకాళహస్తి లో వైసీపీ గెలుపుకి పని చేశారు, ఈ 5 సం.|| పాలనలో ప్రజలు కోరుకున్న ఎలాంటి మార్పు జరగకపోవడంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే యువత ఆశించే మార్పు సాధ్యం అని నమ్మి ఈరోజు పార్టీలో చేరుతున్నట్టు, శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో తనకి విశేషంగా పరిచయాలు ఉన్న వేల మంది విద్యార్థులను సైతం శ్రీకాళహస్తి లో జనసేన పార్టీ గెలుపు కొరకు కృషి చేసేలా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ ఇంఛార్జి తోట గణేష్, మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల ఇంఛార్జి పేట చంద్రశేఖర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.