వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు.. కస్టడీకి తీసుకున్న పోలీసులు

- కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ను పొడిగించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు
- నేటి నుంచి మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి వంశీ
- వైద్య పరీక్షల కోసం వంశీని ఆసుపత్రికి తీసుకెళుతున్న పోలీసులు
మరోవైపు, ఇదే కేసులో వల్లభనేని వంశీని విచారణ కోసం పటమట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. విచారణ సమయంలో నాలుగు సార్లు వంశీని ఆయన న్యాయవాది కలిసేందుకు కోర్టు అనుమతించింది. విజయవాడ పరిధిలోనే విచారణ జరపాలని షరతు విధించింది. ప్రస్తుతం వంశీని ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తీసుకువెళుతున్నారు. అనంతరం ఆయన విచారణ ప్రారంభమవుతుంది.