Chandrababu: గ్రామ సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్

BSR NEWS
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం
- ఈ నెల 27లోగా బదిలీలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి
- 29,30 తేదీల్లో బదిలీలకు కౌన్సిలింగ్
పాలనా కారణాలు ఉంటే ఏ ఉద్యోగినైనా తప్పనిసరిగా బదిలీ చేసే అధికారం కూడా కలెక్టర్ లకు ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఏసీబీ, విజిలెన్స్ కేసులు ఉన్న ఉద్యోగులను బదిలీలకు అనర్హులుగా పేర్కొంది. బదిలీ అయిన ఉద్యోగులకు టీటీఏ గానీ మరే ఇతర ప్రయోజనాలు కూడా లభించవు. ఏ ఉద్యోగీ తమ స్థానిక గ్రామ, వార్డుల్లో పోస్టింగ్ కోసం దరఖాస్తు చేయకూడదు. నాన్ ఐటీడీఏ ప్రాంతాలతో పోలిస్తే ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. మ్యూచువల్, స్పౌజ్, మెడికల్, విభిన్న ప్రతిభావంతులు, వితంతువులు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు మించి పని చేసిన వారు బదిలీకి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.