త్వరలో ఏపీలోనూ భారత్ బియ్యం BSR NEWS

త్వరలో ఏపీలోనూ భారత్ బియ్యం
AP: కిలో కేవలం రూ.29కే లభించే భారత్ బియ్యంత్వరలోనే ఏపీకి కూడా రానుంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకల్లో అమ్మకాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరో 10 రోజుల్లోనే ఆంధ్రాలో కూడా మొదలుపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి అనంతపురం కదిరిలో ఇటీవలే విజయవంతంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించామని పేర్కొన్నారు. ఎన్సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ బండార్ దుకాణాల ద్వారా అమ్మకాలు చేపట్టనున్నట్లు వివరించారు.