ఐరాల: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి BSR NEWS

ఐరాల: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ సంక్షేమపథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎస్బీఐ మేనేజర్ హనుమంతు నాయక్ సూచించారు. నాబార్డ్ ఆధ్వర్యంలో స్థానిక వెలుగు సంఘమిత్రలతో కలసి ప్రజలకు ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించారు. పీఎం సురక్ష భీమా యోజన, పీఎం జీవన జ్యోతి, అటల్ పెన్షన్ యోజన, సామాజిక భద్రత పథకాలు, ఇన్సూరెన్స్ స్కీంలు, సైబర్ నేరాల గురించి పొదుపు సంఘాలకు వివరించారు. కళాజాత ద్వారా అవగాహన కల్పించారు.