జాతీయంఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్ -కేంద్రం…
BSR News( Jaggaiapeta ) ప్రతినిధి ఫిబ్రవరి : 23 న్యూఢిల్లీ:- విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్ తీసుకురానుంది.విద్యార్థుల వయసు ఆరు ఏళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్ ఉండాలని నిర్ణయించింది.ఈ మేరకు..ఈ నిబంధనను పాటించేలా చూడాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రవిద్యాశాఖ ఉత్వర్వులు జారీ చేసింది.కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం, పునాది దశలో పిల్లలందరికీ (3 నుండి 8 సంవత్సరాల మధ్య) ఐదు సంవత్సరాల అభ్యాస అవకాశాలను కలిగి ఉంటుంది,ఇందులో మూడు సంవత్సరాల ప్రీస్కూల్ విద్య (నర్సరీ, ఎల్కేజీ,యూకేజీ) తర్వాత.. 1, 2 తరగతులు ఉంటాయి. పిల్లల శారీరక,మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా చిన్న వయస్సులో పాఠశాలలకు పంపరాదని గత ఏడాది సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది.
BSR News Jaggaiahpeta N.T.R District
- Reporter Sai Chaluvadi