వందేభారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ విజయవంతం.. రైలులో మతిపోయే ఫీచర్లు!

వందేభారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ విజయవంతం.. రైలులో మతిపోయే ఫీచర్లు!
  • ముంబై-అహ్మదాబాద్ మధ్య ట్రయల్ రన్ పూర్తిచేసుకున్న వందేభారత్ స్లీపర్ రైలు
  • ప్రయాణంలో ప్రపంచస్థాయి అనుభూతులు అందించేలా డిజైన్
  • భద్రతకు పెద్దపీట.. రైలులో ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటు
  • మొత్తం 1,128 మంది ప్రయాణించే వెసులుబాటు
  • ఆటోమెటిక్ డోర్లు, కుషన్డ్ బెర్త్‌లు, ఆన్‌బోర్డ్ వై-ఫై వంటి ఫీచర్లు

విజయవంతంగా ట్రయల్ రన్స్ పూర్తిచేసుకున్న వందేభారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు సేవలు అందించేందుకు ముస్తాబవుతోంది. ప్రయాణికులను అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చే ఈ రైలులో ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేశారు. భారతీయ రైల్వేలో మైలురాయిగా మిగిలిపోనున్న ఈ రైలు ప్రయాణికులకు ప్రపంచస్థాయి అనుభూతిని అందించనుంది. 
రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్‌వో) ఆధ్వర్యంలో వందేభారత్ స్లీపర్ రైలు విజయవంతంగా ట్రయల్స్ పూర్తిచేసుకుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య 540 కిలోమీటర్ల మేర ఈ ట్రయల్స్ నిర్వహించారు. భారత తొలి వందేభారత్ స్లీపర్ రైలు నిర్మాణాన్ని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ గతేడాది డిసెంబర్ 17న పూర్తిచేసింది.